తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం
{ అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఘనంగా 37 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు }
మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-31):: మన దేశ ఏకైక తోలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, దేశానికి 16 సంవత్సరాలు ప్రధాన మంత్రిగా వ్యవహరించిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ ( ఇందిరా ప్రియదర్శిని గాంధీ ) 37 వ వర్ధంతి కార్యక్రమాన్ని అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు.ఈ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడు బానోత్ భీముడు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల సీనియర్ నాయకులు జి ముత్తయ్య, కొత్తపల్లి లక్ష్మణ్ రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు ఉన్నారు.
Post A Comment: