పెంచిన PRC అమలు చేయాలి
సీతా మహాలక్ష్మి డిమాండ్
,,,,,.......................................
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పెంచిన PRC 30 శాతం జులై నుంచి అమలు చేస్తాం అని ప్రకటించి GO ఇచ్చినా నేటికి వేతనాలు ఇవ్వటం లేదని అంగన్వాడీ టీచర్స్ & హెల్పేర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ch సీతా మహాలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ రోజు కరకగూడెం మండలం లోని ఆనంతరం లో జరిగిన మణుగూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఏఐటీయూసీ యూనియన్ లో చేరిక సందర్భంగా సమావేశంలో మాట్లాడారు
Icds అంగన్వాడీ డిపార్ట్ మెంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రేవేట్ పరం చేయాలని చూస్తూ నిధులు మంజూరు తగ్గిస్తుంది అని ఆరోపించారు.
మాతా శిశు సంక్షేమ పథకాలను పల్లె స్థాయి లో తీసుక వెళ్లి మాతా శిశు అభివృద్ధి కి మరియు మరణాలు రేటు తగ్గింపు లో మంచి పలితాలు సాధిస్తున్న ఘనత అంగన్వాడీ టీచర్స్ హెల్పేర్స్ కు దక్కుతుంది అని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం కు సిబ్బంది సంక్షేమం పై మమకారం కూడా లేదు అని అన్నారు.
తక్షణమే icds కు నిధులు పెంచాలి అని .అంగన్వాడీ టీచర్స్ కు ప్రమోషన్స్. ప్రభుత్వ ఉద్యగ భద్రత కల్పించాలని. పెన్షన్. హెల్త్ కార్డ్స్. రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్.జిల్లా నాయకులు.అక్కి నరసింహారావు వి సతీష్ పోడెం విజయకుమారి సుజాత రమాదేవి సావిత్రి శిరీష పూర్ణిమ అనురాధ విజయలక్ష్మితదితరులు పాల్గొన్నారు
Post A Comment: