CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రమాద మెరుగని ఉత్పత్తి.. స్వభావాన్ని ప్రతి కార్మికుడు కలిగి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ అప్పారావు

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

       ప్రతి కార్మికుడు ప్రమాద మెరుగనీ ఉత్పత్తి స్వభావాన్ని కలిగి ఉండాలని పీకే ఓసి సెక్షన్ 2 రిలే A షిఫ్ట్ ఇంచార్జ్ వి అప్పారావు అన్నారు, సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం చేపట్టిన ఎస్ ఓ పి కంఠస్థ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం pk ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన షిఫ్ట్ ప్రారంభంలో కార్మికులచే చదివించే "సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ " కార్యక్రమంలో ఆయన కార్మికునుద్దేశించి మాట్లాడారు, ఉపరితల గనుల్లో హాల్ రోడ్లు, డంప్ యార్డ్స్ తో పాటు షావెల్స్, డ్రిల్స్ , డోజర్స్, గ్రేడర్స్ అవి పనిచేసే పని స్థలాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతాయనీ షిఫ్ట్ ప్రారంభంలోనే మరియు ద్వితీయార్థం లో కూడా మైక్ ద్వారా సంబంధిత సమాచారం ప్రకటించడం జరుగుతుందని ఆపరేటర్లు అనుబంధ కార్మికులు వాటి వివరాలను అర్థం చేసుకుని దారి తప్పకుండా గమ్యం చేరాలని రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడాలని ఆయన కోరారు, డంపర్ ఆపరేటర్లు డంపర్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై మల్లికార్జున్ అనే ఆపరేటర్ SOP చదివి ఆపరేటర్లకు వినిపించారు అనంతరం కార్మికులందరితో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అధికారులు గుత్తుల శ్రీనివాస్, సూపర్వైజర్లు వై రామ్ గోపాల్, కుమారస్వామి, సుధీర్ గుర్తింపు సంఘం నాయకులు శ్రీనివాస్ , మామిడి రాజు కుమారస్వామి ,ఎస్ ఓ పి సమన్వయకర్త నా సర్ పాషా తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: