గుండాల అక్టోబర్ 22 (మన్యం మనుగడ) మూడు లైన్ల కరెంటు లైన్ కోసం విద్యుత్ శాఖ , అటవీశాఖ అధికారులు సంయుక్తంగా డిజిటల్ సర్వే నిర్వహించారు. ముత్త పురం నుండి పెద్ద తోగు సాయన్న పల్లి నుండి ఘనపురం వరకు ఈ సర్వే చేసినట్టు విద్యుత్ శాఖ ఏ డి ఈ కోక్యా నాయక్ పేర్కొన్నారు. అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసుకోవడంతో ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం ఈ సర్వే చేశామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే విద్యుత్ అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం , ముత్త పురం సర్పంచ్ సమ్మయ్య , ఏ ఈ రవికుమార్, అటవీశాఖ , విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు
Post A Comment: