👉జర్నలిస్టుల పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
👉సిఐడి డిఐజి ఏ వి రంగనాథ్ కు వినతి పత్రం
జర్నలిస్టులపై న ఉమ్మడి జిల్లాలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అదేవిధంగా జర్నలిస్ట్ ల పై దాడులు ను అరికట్టాలని అక్రమ కేసులు బనాయించ కుండా చూడాలని సిఐడి డిఐజి రంగనాథ్ కి డెమో ట్రిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యరమల.కిషోర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు సీఐడీ డీఐజీ ఏవీ రంగనాధ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఒక్క ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడానికి వచ్చిన సందర్భంగా డిజేఎఫ్.యూనియన్ అధ్యక్షుడు యరమల.కిషోర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన
విలేకరులతో మాట్లాడుతూ విలేకర్ల పై తప్పుడు కేసులు బనాయించే పరిస్థితులు నెలకొంటున్నాయి చెప్పుడు మాటలు విని విలేకర్ల పై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు ఇలాంటి వాటి పై దృష్టి పెట్టి బాధిత విలేకరులకు న్యాయం కల్పించి అవసరమైతే విచారణ జరిపి వారికి అండగా నిలవాలని వారిపై అక్రమంగా పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని విలేకరులకు న్యాయం చేసేలా చూడాలని సిఐడి డిఐజీ.ని.ఆయన
కోరారు అని తెలిపారు
Post A Comment: