న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న
గుండాల అక్టోబర్ 4 (మన్యం మనుగడ) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మృతికి కారకులైన బీజేపీ నాయకుల తక్షణమే శిక్షించాలని న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రైతుల మృతికి కారకులైన వారి మీద హత్య కేసు నమోదు చేయాలన్నారు. లఖింపూర్ జిల్లా లో కేంద్ర మంత్రి పర్యటన లో కాన్వాయి లోని వాహనం రైతులపై ఎక్కించడం తో నలుగురు రైతులు మృతి చెందారని ఆయన అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ మిశ్రా కుమారుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిసిన ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన అన్నారు. బాధ్యులను తక్షణమే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేడు సడక్ బంద్ లో కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమరం శాంతయ్య , ఈ సం చంద్రయ్య , బోర్ర వెంకన్న, ఈ సం కృష్ణ , సనప కృష్ణ , ఎనగంటి గణేష్ , కల్తీ శ్రీను , సనప కుమార్, జగన్, కల్తీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: