మన్యం టీవీ వెబ్ డెస్క్:
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు,ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రజలకు విప్ రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు అడపచులు అందరూ కల్సి ఆడే గోప్ప పండగ బతుకమ్మ అని,దేశం లోనే పూలను పూజించి,ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని,అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు.ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.ఈ పండుగను ప్రజలందరు గొప్ప వేడుకగా, భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
Post A Comment: