మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటన హర్షనీయం కానీ ఏజెన్సీ లో నివసిస్తున్న దళిత బహుజనులకు కూడా గిరిజనులతో పాటు పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని దళిత నాయకులు అంబేద్కర్ వాది, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు కోరారు.
రాష్ట్ర ప్రబుత్వం పోడుభూములకుపట్టాలు గిరిజనులతో పాటు తర తరాల నుండి జీవనం కొనసాగిస్తున్న అనేక మంది పేద దళిత, బడుగు బలహీన బహుజన వర్గాల ప్రజలు కూడా ఉన్నారు కావున వారికి కూడా పట్టాలు ఇవ్వాలని తెలిపారు పోడుభూమి సబ్ కమిటి లో అన్ని వర్గాలవారిని తీసుకోవాలని తెలిపారు. ఇలా చేయటం వలన అన్ని వర్గాల నిరుపేదలకు న్యాయం జరుగుతుంది ఇది ప్రభుత్వం గుర్తించి అందరికి హక్కు కల్పించాలని అంబెద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దిగొండ కాంతారావు తెలిపారు.
Post A Comment: