- ఛలో హైదరాబాద్
- తెలంగాణ మాల మహానాడు ప్లీనరీని విజయవంతం చేయండి రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యుడు చిట్టి మల్ల సమ్మయ్య
- ప్లీనరీకి ఐదు రాష్ట్రాల ప్రతినిధుల రాక మంచాల నాగేంద్ర కుమార్ మంగపేట మండల అధ్యక్షుడు
మన్యంటీవీ మంగపేట.
అక్టోబర్ 31న హైదరాబాద్ లో జరిగే మాలమహానాడు మొదటి 16 వార్షికోత్సవ సభ కర పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం. రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యుడు చిట్టి మల్ల సమ్మయ్య ఆదేశాల మేరకు మంగపేట మండల కేంద్రం లో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది, ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు కర్రీ శ్యాంబాబుహాజరైమాట్లాడుతూ దళితుల ఐక్యత కోసం అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల సమగ్ర అభివృద్ధి సాధన కోసం జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లిసుధాకర్ అధ్యక్షతన ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అక్టోబర్ 31న నిర్వహించే ప్లినరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మాల బిడ్డ హాజరు కావాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కర్రీ శ్యాం బాబు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి గంగిర్ల రాజారత్నం, జిల్లా కార్యదర్శి ముగ్గుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు మోదుగు బాబు, గ్రామ అధ్యక్షులు గంగిర్ల శీను, మండల మీడియా ఇంచార్జ్ స్నేహ కుమార్, జయరాజు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Post A Comment: