మన్యం మనుగడ వాజేడు . ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన వాజేడు, మండల కేంద్రంలోని చింతూరు, గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది . ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం. ఊరి చివర మూలమలుపు వద్ద, వెళుతున్న బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టగా. ఈ ఘటనలో మరో బైక్ ప్రమాదవశాత్తు తను తీసుకు వస్తున్న మద్యం బాటిల్ పగిలి బలంగా గుచ్చుకోవడం తో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. మద్యం బాటిల్ లపై పడ్డ వారిని స్థానికులు బయటకు తీశారు. ఆ ఇద్దరిలో ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి గార రాంబాబు, ధర్మవరం గ్రామంలో నివాసం ఉండే వారిగా గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి మరింత విషమయం గా ఉన్నట్లు సమాచారం విషయం తెలుసుకున్న వాజేడు ఎస్ ఐ, కొప్పుల తిరుపతి రావు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన 108 సహాయంతో ఎటూరు నాగారం పి. హెచ్. సి .కి తరలించినట్లు సమాచారం.
Post A Comment: