👉🏻 ఓ..శక్తి గుడిలో దండలు మార్పించిన వైనం
👉🏻పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన దిశా కమిటీ.
అశ్వాపురం-భద్రాద్రి కొత్తగూడెం
*అశ్వాపురం మండలం ఎస్సీ కాలనీకి చెందిన ఇసంపల్లి. బుల్లయ్య వయస్సు 26 సంవత్సరాలు.. అదే కాలనీకి చెందిన మట్టి.హైమావతి వయస్సు 24 సంవత్సరాలు గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు..వరుడు బుల్లయ్య వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అమ్మాయి-అబ్బాయి అశ్వాపురం మండలానికి చెందిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ కమిటీ వారిని సంప్రదించారు...ఇరువురుని కమిటీ వారు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఇష్ట పూర్తిగా మండల కేంద్రంలో గల ఓం.. శక్తి దేవాలయంలో వారికి దండలు మార్పించి అమ్మాయిని అబ్బాయిని వారి ఇంటివద్దకు పంపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ-పూజారి జ్యోతి-మల్లు స్వరూప-చెట్టి.హేమలత-మాలోత్. సువర్ణ మరియు మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు-ఎస్సీ సెల్ నాయుకులు చుంచు.రాంమూర్తి-గద్దల రామకృష్ణ-మైనారిటీ నాయుకులు షేక్ నయీమ్-కొమ్ము.రాంబాబు-గద్దల వెంకన్న-వెంకటేశ్వర్లు-మేకల భాస్కర్- తదితరులు పాల్గొన్నారు*
Post A Comment: