ఎమ్మెల్యే మెచ్చా సూచనల మేరకు అసుపక లో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీపీ
మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లోని ఆశుపాక గ్రామ పంచాయితీలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ నిధులతో సుమారు 5 లక్షల రూపాయలతో నిర్మింపబడుతున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి, ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఒక్క పల్లెను కూడా అభివృద్ధిలో ముందు వుండేలా అభివృద్ధి ప్రగతి పథంలో నడిపేందుకు నిరంతరం శ్రమిస్తూ వున్నారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, సర్పంచ్ లింగయ్య, ఎంపీటీసి వగ్గెల అనసూర్య, ఉప సర్పంచ్ వేంకటేశ్వరరావు, వార్డు మెంబర్ వెంకటేష్, మండల యూత్ ఉపాధ్యక్షులు అకుల .శ్రీను, తెరాస యువజన నాయకులు శెట్టిపల్లి రఘురామ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: