గుండాల అక్టోబర్ 4 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల ఏడో తారీఖు న జరిగే ఇంటర్వ్యూ హాజరుకావాలని ఎంపీడీవో బాలామణి ఒక ప్రకటనలో కోరారు. 2020, 21 సంవత్సరానికి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు ఇందులో పాల్గొనాలని ఆమె సూచించారు. ఏడో తారీఖు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం వరకు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు, సకాలంలో సంబంధిత పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు
Navigation
Post A Comment: