మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ రాష్ట్రం లో ఉన్న 73రకాలషెడ్యూల్ కార్మికులు తమకు కనీస వేతన చట్టం అమలుచేయాలని , సిఎం కేసీఆర్ గారు కనీస వేతనం కోసం జీ ఓ చేసి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 8 న సీఐటీయూ అధ్వర్యంలో 73 రకాల షెడ్యూలు కార్మికులు ఒక్క రోజు టోకెన్ సమ్మె చేస్తున్నారు. ఈ రోజు బిల్డింగ్ అడ్డా పై కార్మికుల సభ సీఐటీయూ ఇల్లందు మండల కన్వీనర్ ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ సింగరేణి సంస్థ లోని కాంట్రాక్టు కార్మికులు,బిల్డింగ్ వర్కర్స్, షాప్ ఎంప్లాయిస్,మిల్లు, ట్రాన్స్పోర్ట్,ప్రైవేట్ స్కూల్ కాలేజీల డ్రైవర్లు, నాన్ టీచింగ్,హాస్పటల్లో, లాబ్ లలో ,ఇటుక బట్టిలలో, బట్టల షాప్ లో ఇతర అన్నిరకాల ప్రైవేటు కార్మికులు ఒక్క రోజు టోకెన్ సమ్మె తమకు కనీస వేతనం 19వేలు, పీ ఎఫ్, ఇన్స్యూరెన్స్,లీవులు,బోనస్,వైద్య సదుపాయం,పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తు రేపు సమ్మె కు సంబందించి అన్ని రంగాల కంపెనీలు,యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈ సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు నాగరాజు,మహమూద్,సామ్యా నాయక్,లక్ష్మణ్ పాసీ, రాణి మహేశ్వరి,పద్మ,మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: