మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో హిజ్రాలు తమ మానవతా హృదయాన్ని చాటుకున్నారు. స్థానిక కోనేరు బజారులో గల అమ్మ సేవ సాధనం లో దిశ ప్రొటక్షన్ వెల్పేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ముఖ్య అతిధిగా పిలిచి వృద్దులకు అన్నదానం చేసారు. అనంతరం వృద్ధాశ్రమం వ్యవస్థాపకురాలు అన సూర్యమ్మ మరియు వేముల భారతి లకు సన్మానం చేసి ఆశీర్వదించారు. ఈ సందర్బంగా వేముల భారతి మాట్లాడుతూ ఇంత మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అంతే కాకుండా సమాజంలో సైతం వీరిని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ రోజు ఈ మహోన్నత మైన కార్యక్రమం లో నన్ను భాగస్తురాలుని చేయడం సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. ఈ రోజు అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమాలో మానవతా దృక్పదంతో అర్ధనారీశ్వరులు వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసిన వారికి వృద్ధాశ్రమం తరపున కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రాధ మరియు అమ్మ సేవ సధన సభ్యులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: