CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:


 

మన్యం టీవీ అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు గ్రామంలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటను శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అధికారుల తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా సాగుచేసుకుంటున్న విధానంపై వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పామాయిల్ సాగు అవగాహన సదస్సు కార్యక్రమంలో విప్ రేగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సాగునీటి వసతి కలిగిన ప్రాంతాలలోనే ఆయిల్ ఫామ్ సాగు చేయడం సాధ్యమవుతుంది అని, ఒకసారి నాటిన మొక్క 30 ఏళ్లపాటు పంటనిస్తుంది అని తెలిపారు.మొక్క నాటిన మూడేళ్ల లోపు,అంతర పంట వేసుకోవచ్చు అని,నాలుగో ఏడాది నుంచి ఆయిల్ ఫామ్ పంట చేతికి వస్తుంది అన్నారు. ఆయిల్ ఫామ్ చెట్లలో అంతర పంటలుగా కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగు చేసుకోవచ్చుఅన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగు నీటి వసతి,నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయాలు ఫామ్ ఆయిల్ రైతాంగానికి చాలా అనుకూలంగా ఉంటుందని,నిత్యం రైతులకు పామాయిల్ సాగు మీద అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ బ్రహ్మయ్య,మణుగూరు జడ్పిటిసి పొశం.నర్సింహారావు, ఎంపీపీ ముత్తినేని సుజాత,ఏ డి ఏ తాతారావు,అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: