CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కానిస్టేబుల్ నర్సింహారావు గుండె పోటుతో అకాల మృతి:నివాళులు అర్పించిన పోలీస్ అధికారులు. పోలీస్ అధికారుల సంఘం తరుపున రూ.20 వేల ఆర్ధిక సహాయం

Share it:

 


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున గుండె పోటు తో మృతి చెందిన కానిస్టేబుల్ నర్సింహారావు కుటుంబానికి పోలీస్ అధికారుల సంఘం ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. కొత్తగూడెం ట్రాఫిక్ విభాగం లో విధులు నిర్వహిస్తున్న నర్సింహారావు,స్వస్థలం మణుగూరు మండలం లోని కొత్త పద్మగూడెం.పద్మగూడెం గ్రామంలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించిన పోలీస్ అధికారులు, సిబ్బంది.నర్సింహారావు అంతిమ సంస్కారం కోసం రూ.20 వేల నగదును పోలీస్ అధికారుల సంఘం తరుపున కానిస్టేబుల్ కొప్పుల వెంకటేశ్వరరావు,చేతుల మీదుగా నర్సింహారావు భార్యకు అందజేశారు.ఆ కుటుంబానికి అన్ని విధాల పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నర్సింహారావు కుటుంబానికి పోలీసు శాఖ నుంచి అందవల్సిన ఆర్ధిక సహాయం అతి త్వరగా వారికి అందించేందుకు,ఉన్నతాధికారులతో మాట్లాడి కుటుంబాన్ని ఆదుకుంటామని,జిల్లా పోలీసు అధికారులు సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు,కె.వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఎస్ ఐ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: