మన్యం టీవీ : ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అంగన్ వాడీ కేంద్రాలకు గతంలో లాగా సెంటర్ వరకు ఫీడింగ్, రేషన్ నేరుగా సరఫరా చేయాలి అని అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ ఈరోజు నాయకుల గూడెం సర్కిల్ సమావేశం మామిడిగూడెం లో జరిగినది,ఇందులో సీఐటీయు నాయకులు ఈసం వెంకటమ్మ,అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ. ..ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధాన కర్తలు గా పనిచేస్తున్న అంగన్ వాడీ టీచర్ల పై ప్రభుత్వం సర్వేల పేరుతో అనేక పనులు చేయిస్తూ పనిభారం పెరిగిందని పిల్లకు పౌష్ఠిక ఆహారం అందించాల్సిన అవసరం ఉన్నా కానీ అదనపు పనులు పెడుతున్నారని వాపోయారు.గతంలో రేషన్, ఫీడింగ్ నేరుగా అంగన్ వాడీ కేంద్రాల వద్ద కు పంపెవారని నేడు ఫీడింగ్, రేషన్ లిఫ్ట్ చేయడానికి ఎంతో భారంగా ఉన్నదని గతంలో లాగా సెంటర్లకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వనజ,రమణి,శోభ,శ్రీలత,మంగ,శకుంతల,అంజమ్మ,సునిత,మౌనిక,అరుణ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: