గాంధీ జయంతి సందర్భంగా అయన విగ్రహాన్ని కి పూల మాలాలు వేసి నివాళులు అర్పించిన పాత్రికేయులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు
మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యలయలలొ,మహాత్మ గాంధీ విగ్రహాన్ని కి వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు,పాత్రికేయులు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ విగ్రహానికి, చిత్ర పాటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు వేరు వేరుగా మాట్లాడుతూ బాపూజీ జీవితం, ఉన్నతమైన ఆలో చనల నుంచి మనం నేర్చకోవాల్సింది ఉందన్నారు.భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ చేసిన సేవలు మరవలేనివని అన్నారు.అహిసను ఒక సైద్ధాంతిక నైరూప్యంగా కాకుండా ఆచరణీయ రాజకీయ సాధనంగా చేపట్టిన భావ సాహసి,దార్శనియుడు గాందీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా జడ్పిటిసి కొమరం కాంతారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు డా,,చందా సంతోష్ కుమార్, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాత్రికేయులు పార్క్, రఫీ, శ్రీనివాస్ సురేష్ ప్రెమ్ కుమార్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: