మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో మానవీయ వృద్ధాశ్రమాన్ని తహసిల్దార్ సురేష్ కుమార్ శనివారం సందర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో మహాత్మ గాంధీ చిత్ర పటానికి తహసిల్దార్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తహసిల్దార్ వృద్ధులతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు దైదా నారాయణ రెడ్డి, కమటం వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: