భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 3 (మన్యం టీవీ) :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో గల 27 వార్డ్ ప్రగతి మైదానం నందు సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఛాంపియన్షిప్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి వి వి జి కృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతలక్ష్మి పాల్గొని, మాట్లాడుతూ భవిష్యత్తులో జరగబోయే క్రీడా కార్యక్రమంకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. అదేవిధంగా ప్రగతి మైదాన్ గ్రౌండ్లో లో కరెంటు సరఫరా లేని కారణంగా త్వరలోనే విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజేతలు సబ్ జూనియర్ అండర్ 10 విభాగంలో వి సామ్యూల్, సంతోష్ భాగం, ఐ యాం, అండర్ 11విభాగంలో సోఫీ, హర్షిత్,హరీష్ పటేల్, అండర్ 13 నయానేష్,సోమ శివనాథ్,వర్షిత్.అండర్14 విభాగంలో ప్రేమ్,ఆదినారాయణ బహుమతులు ఇచ్చి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె .మహిధర్,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి,ఆర్. రాజేంద్ర ప్రసాద్,మాల మహానాడు జిల్లా కార్యదర్శి పూల రవీందర్,జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి, కే.నవీన్ కుమార్, సైక్లింగ్ కోచ్ పాపరాజు, జాయింట్ సెక్రెటరీ సాయిరాం, పి ఈ టి నాగలక్ష్మి, కోచ్ గిరి ప్రసాద్, కోచ్ సాయి తేజ,కోచ్ వెంకటేష్ పాల్గొన్నారు.
Post A Comment: