మన్యం టీవీ, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామ పంచాయతీలో బతుకమ్మ మరియు దేవి నవరాత్రుల సందర్భంగా ఆదివాసీ నాయకపోడు మహిళలు బతుకమ్మ బోనాలు తో సందడి చేశారు. వినాయకపురం రామాలయం వద్ద ఏర్పాటు చేసుకున్న దుర్గమ్మ గుడి వద్ద నుండి బతుకమ్మ బోనాలను తలపై పెట్టుకొని గ్రామంలో ఉన్న అన్ని గుడిలో వద్దకు మేళతాళాలతో మంగళవాయిద్యాలతో వెళ్లి ప్రదక్షిణాలు చేసి పూజలు ముగించుకొని మరల దుర్గమ్మ గుడి వద్ద బోనాలను పెట్టి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో నాయకపోడు ఆదివాసి మహిళలు అనేక మంది పాల్గొన్నారు.
Post A Comment: