CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బీటీపీఎస్ లో ఘనంగా అమ్మవారి విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు

Share it:

 



ముఖ్య అతిధిగా పాల్గొన్న బిటిపిఎస్ సీ ఈ పిల్లి. బాలరాజు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో బుధవారం విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిటిపిఎస్ సీఈ పిల్లి.బాలరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఎటువంటి భేదాలు లేకుండా ఐక్యంగా కలిసి ఉండాలన్నారు.ఆ అమ్మవారి కరుణ అందరిపై ఉండాలని, ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా,ఒకరికొకరి సహకరిస్తూ ప్లాంట్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకున్నారు.ఈ పూజ కార్యక్రమానికి స్టేజి-1 ఎస్ఈ వెంకట నాయుడు,స్టేజి-3 ఎస్ఈ వీరేశం,ఎస్ఈ ఏడీఎం శ్రీనివాసరావు,డీఈలు మురళికృష్ణ,చంద్రశేఖర్,ఈఈలు శ్రీనివాస్,చందులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, ప్రకాష్,ప్రసాద్,విజయ్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: