ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ స్థలం నందు స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ప్రధాన అర్చకులు ఎల్లాప్రగడ రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేశారు.రూ.5,51 లక్షల రూపాయలతో అలంకరణ చేశారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నూక ప్రభాకర్, లక్ష్మణాచారి,అశోక్, బిక్షపతి,డాక్టర్ భరత్ రెడ్డి, ప్రసాద్,గంజి రమేష్,ముక్కెర లాలయ్య,పర్వతాల లాలయ్య,రాంబాబు,సురేష్, కోటి,ప్రమోద్,సాయి,రాజు, మహంత్ మహిళలు భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: