విప్ రేగా కాంతారావు ని మర్యాద పూర్వకంగా కలిసిన సినీ నటులు ఆర్ .నారాయణ మూర్తి
సినీ నటులు ఆర్ .నారాయణ మూర్తి ని ఘనంగా శాలువాతో సన్మానించి,పుష్ప గుచ్చం అందజేసిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను నటులు, ఆర్ నారాయణ మూర్తి మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన,రైతు సాగు చట్టాల వలన,వ్యవసాయం చేసే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో ప్రజలకు అర్థమయ్యేలా రూపొందించిన *రైతన్న* చిత్రం 22 వ తేదీన విడుదల అవుతుందని, చిత్రాన్ని వీక్షించాలని విప్ రేగా ను ఆయన కోరారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ తప్పకుండా చూస్తాను అని తెలిపారు.నటన లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటులు ఆర్.నారాయణ మూర్తి అని అన్నారు.గొప్ప నటులు ఐనప్పటికీ,ఎన్నో సినిమాలలో నటించిన ఎప్పుడు సామాన్య వ్యక్తి లా ప్రజల లో కలిసిపోతారని, నిరాడంబరంగా ఉంటారని వారిని అభినందించారు. ఆయన చేసే సినిమాలలో సమాజం కోసం మంచి సందేశం ఉంటుందన్నారు.తన మాటలు,నటనతో ప్రజలను చైతన్యం చేయగలిగిన వ్యక్తి ఆర్.నారాయణ మూర్తి అని తెలిపారు.నేటి సమాజానికి ఇటువంటి సినిమాలు చాలా అవసరం అని పేర్కొన్నారు.భద్రాద్రి సీతారాముల స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని అని,ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని, కోరుకుంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి పొశం.నర్సింహారావు,మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అభిమానులు,యూత్ నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: