భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 5 (మన్యం టీవీ) : - ఈనెల బుధవారం నుంచి జరగనున్న బతకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కొత్తగూడెం ప్రజలకు అనుకూలమైన లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని శ్రీనగర్ కాలనీ ముర్రేడు ఘాట్ వద్ద స్థానిక ప్రతినిధులు పారిశుద్ధ్య పనులను చేపట్టారు పిచ్చి మొక్కలను చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడమే కాకుండా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ ప్రాంతాన్ని మట్టితో చదును చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అనుమతి తో లైటింగ్ ఏర్పాట్లను సైతం పర్యవేక్షిస్తున్నారు. పనులను శ్రీనగర్ కాలనీ సర్పంచ్ పూనం నాగేశ్వరరావు ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ ఎం పి టి సి కొల్లు పద్మ ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ భాష పంచాయతీ సెక్రెటరీ పాషా వార్డు సభ్యులు పత్తికొండ సాంబశివరావు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
Post A Comment: