భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 5 (మన్యం టీవీ) : - కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల 10 వార్డు నందు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 17 సెప్టెంబర్ నుండి మొదలైన కోవిడ్ నివారణ స్పెషల్ డ్రైవ్ వ్యాక్సిన్లో భాగంగా పదో వార్డు లో నేటితో విజయవంతమై 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నట్లు పదో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ పేర్కొన్నారు. 18 సంవత్సరాల పైబడిన మొత్తం జనాభా 1500 మంది ఉండగా వీరిలో 1395 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు అని ఆమె తెలిపారు. మిగతా 105 మందిలో డోర్ లాక్ వాళ్ళు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, బెడ్ పై ఉన్న వృద్ధులు, అనారోగ్య బారిన పడిన వారు ఉన్నారని ఆమెతెలిపారు. మిగతా వారితో 100% వ్యాక్సిన్ వేసుకొని రామవరం లో ఇప్పటివరకు మా వార్డు ప్రథమ స్థానంలో ఉందని చెప్పు కొనుటకు నాకు గర్వకారణంగా ఉందని, దీనికి సహకరించిన వ్యాక్సింన్ చేయించుకున్న ప్రజలకి, వైద్య సిబ్బంది డాక్టర్ సంజీవ రావు, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ రవీందర్, సి ఓ శ్రీనివాస్, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్ భవాని, అంగన్వాడీ టీచర్స్ సరోజ, రజిత, నీలవేణి, ఆర్ పి లు జానకి, కవిత, మున్సిపల్ అసిస్టెంట్ రాము, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె అన్నారు.
Navigation
Post A Comment: