భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 2 (మన్యం టీవీ) :- శనివారం నాడు భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం పట్టణం లోని మేదర బస్తీకి చెందిన ఆకుల కుసుమ హరనాథ్ ( 36) హోటల్లో పనిచేసే వారు. అతని భార్య పేరు వినీల, వీరికి పూజిత9, అవంతిక5సంవత్సరాల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. హోటల్లో పనిచేసే క్రమంలో కరోనా సోకగా హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హరినాథ్ మరణించారు. భర్త చికిత్సకు చేసిన అప్పులతో పాటు ఇద్దరు ఆడ పిల్లల పోషణ కష్ట తరంగా మారిన నేపథ్యంలో ఎమెస్సి, బీఈడీ రసాయన శాస్రం చదివిన తనకు ఉపాది అవకాశం కల్పించాలని ఇటీవల ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినీల దరఖాస్తు చేయగా, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆమెకు ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉపాధి అవకాశం కల్పించాలని జిల్లా ఉపాధి కల్పనాదికారి విజేతను ఆదేశించారు. ఈ మేరకు వినీలకు అశ్వారావుపేట గురుకుల పాఠశాల లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ అవకాశం కల్పించి ఈరోజు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతులు మీదుగా వినీల అందుకున్నారు. కష్టాలు లో ఉన్న తమ సమస్యను విని తనకు ఉపాధి అవకాశం కల్పించిన కలెక్టర్ కు వినీల కృతజ్ఞతలు తెలిపారు.
వినీల కు ఉపాధి కల్పనలో సత్వరమే అవకాశం కల్పించిన జిల్లా ఉపాధి కల్పన అధికారిణి విజేతను జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు.
Post A Comment: