భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 2 (మన్యం టీవీ) :- పోడు సాగు చేసుకుంటున్న రైతుల పై ప్రభుత్వం చేస్తున్న దమనకాండ కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 5న వామపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ పరోక్షంగా పోడు భూములను రైతుల వద్ద నుండి బలవంతంగా లాక్కుంటుందనీ
భారత పార్లమెంట్లో చేసిన అటవీ హక్కుల చట్టాన్ని అపహాస్యం చేస్తూ కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీస్తున్నా ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని,
పోడు సాగు చేసుకుంటున్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 5న జరిగే పోడు ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుంది జడ్పిటిసి వసంతక్క నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: