CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణియులు వారి కుటుంబ సభ్యులు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలి డైరెక్టర్ పా, ఎన్ బలరాం

Share it:




సింగరేణియులు వారి కుటుంబ సభ్యులు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు  కోవిడ్ వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలి డైరెక్టర్ పా, ఎన్ బలరాం IRS. భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 3 (మన్యం టీవీ) :-  ప్రపంచ వ్యాప్తంగా సోకిన కోవిడ్  మహమ్మరిని సమూలంగా అరికట్టేందుకు భారత దేశంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చర్యలలో భాగంగా  ముఖ్యంగా సింగరేణి సంస్థ సి.ఎం.డి ఎం శ్రీధర్ ఐఏఎస్ ఆదేశాలతో డైరెక్టర్ల సూచనలతో సింగరేణి డాక్టర్లు అదేవిధంగా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు ఫైనాన్స్ మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్లు ఎంతో కృషి చేసి మొదటి మెగా వ్యాక్సిన్ను 100% పూర్తి చేసింది అదేవిధంగా గా రెండవ విడత వ్యాక్సినేషన్ లో కంపెనీ వ్యాప్తంగా బొగ్గు గనులు మరియు డిపార్ట్మెంట్ వద్దనే  వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందజేయడం జరిగిందని ఇందులో 70 శాతం మంది వ్యాక్సిన్ వినియోగించుకున్నారని  మిగతా 30 శాతాన్ని కూడా సింగరేణియులు  వారి కుటుంబ సభ్యులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా శానిటైజర్లు మరియు  మాస్కులు తప్పనిసరిగా వాడాలని  సింగరేణి సంస్థ డైరెక్టర్ పా బలరాం ఐ ఆర్ ఎస్ విజ్ఞప్తి చేశారని  జిఎం పర్సనల్ ఆర్ సి, ఐ ఆర్ & పి ఎమ్ మరియు అధికార ప్రతినిధి  ఏ.ఆనంద రావు ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: