మాన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి మండలం: ములకలపల్లి సిపియం పార్టీ కార్యాలయంలో సిపియం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ బైరు వెంకటేశ్వర్లు వర్థంతి సభ నిర్వహించారు.సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు ఈసందర్భంగా మాట్లాడుతూ సిపియం పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై కాలినడకతో గిరిజన గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటిపై ఉద్యమాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారని,గిరిజన గ్రామాల్లో కటావాయి కార్మికుల,భూ పోరాటాల్లో ప్రజలను చైతన్య పరిచి ఆయా సమస్యల పై పోరాటాలు,ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు.తన ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంటగ్యాస్,పెట్రోల్,డీజిల్,రేట్లు విపరీతంగా పెంచి పేద ప్రజలపై పెను బారం మోపుతున్నారని.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండాకట్టాలని డిమాండ్ చేశారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిమ్మల మధు,గోపగాని లక్ష్మీ నర్సయ్య,కణితి కాంతరావు,వనమా రమేష్,కోండ్రుపపామ్మ,రాజు,సీత, మంగమ్మ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: