షార్ప్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
మన్యం టీవీ మంగపేట.
మండలంలోని కమలాపురం గ్రామంలో యువ రైతు రాజేశ్వరరావు(డి.జె రాజేష్) సాగుచేస్తున్న సేంద్రియ వ్యవసాయన్ని సమగ్ర నీటి యాజమాన్య పథకం మరియు వాతావరణ నిర్దారణ పథకం షార్ప్ అనే స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో సందర్శించారు.
సహజ సిద్దమైన వ్యవసాయ పద్దతులపై అవగాహన కార్యక్రమంలో వివిద జిల్లాకు చెందిన రైతులు పాల్గోన్నారు యువ రైతు రాజేష్ మాట్లాడుతూ తన కున్న మూడేకరాల పంట భూమిలో రక్తశాలి,నారాయణ కామిని,కాలబట్టి, హెచ్.యం.టి పండించే విధానాన్ని రైతులకు వివరించారు విత్తన శుద్ది నుండి మెదలు పంట వేసే విధానంతో పాటు పంట కోతకు వచ్చే వరకు మెళుకువలను రాజేష్ రైతులకు వివరించారు
రానున్న రోజుల్లో సేంద్రియ వ్యవసాయం చేయటం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు అని రాజేష్ వివరించారు
ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 30 మంది రైతులు పాల్గొన్నారు.
Post A Comment: