గుండాల అటవి క్షేత్ర అధికారి మురళి
గుండాల అక్టోబర్ 5 (మన్యం మనుగడ) భవిష్యత్ తరాల కోసం వన్యప్రాణులను పరిరక్షించాలని గుండాల అటవి క్షేత్ర అధికారి మురళి అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రతి ఏటా వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. వారోత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను సోమవారం నిర్వహించామని అందులో గెలుపొందిన విద్యార్థులకు గుండాల సీఐ శ్రీనివాస్, ఎం పీ ఓ అలీ, గుండాల ఎంపీటీసీ సంధాని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ చేతులమీదుగా విద్యార్థులకు బహుమతులను అందజేశారు అన్నారు. పిల్లల్లో సైతం వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేందుకే వారోత్సవాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాలాజీ, అటవీశాఖ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: