CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో వ్యాక్సిన్ ఈ ప్రక్రియ వేగవంతం చేయండి

Share it:

  


👉తహశీల్దార్ ఉష శారద చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గ్రామాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని తహసిల్దార్ ఉష శారద అన్నారు. మండలంలో గ్రామపంచాయతీలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవ్వాలన్నారు. అలాగే వంకనెంబర్ గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు కుంజా నాగేంద్రబాబు నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ భాగంగా ప్రజల్లో చైతన్యం పరుస్తూ కోవిడ్ వాక్సినేషన్ వేయించుకున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు అందరూ కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోగల ఓటర్లు అందరూ వ్యాక్సినేషన్ వేయించుకునేలా చూడాలని, తహసీల్దార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రాకేష్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: