CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల విద్యార్థినికి బంగారు పతకం

Share it:

 



 మన్యం టీవీ చర్ల:


చర్ల మండలం కు చెందిన నామాల భవిష్య విద్యార్థినికి విశ్వవిద్యాలయం స్థాయిలో బంగారు పతకాన్ని సాధించింది. చర్ల చెందిన మార్కెట్ కమిటీ కార్యదర్శి నామాల శ్రీనివాసరావు, పద్మ దంపతుల కుమార్తె భవిష్య. ఈమె హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఈ ఈ ఈ పూర్తి చేసి విశ్వవిద్యాలయ స్థాయిలో బంగారు పతకం సాధించింది. భవిష్య చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన్ స్కూల్లో పదో తరగతి వరకు చదివి పై చదువుల నిమిత్తం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల హైదరాబాద్ లో చేరింది. రాహుల్ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ డి. ఎన్ కుమార్, స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాను మాద్రి కృష్ణార్జున రావు, విద్యావేత్తలు సి వి కె రావు, చింత రామ్మోహన్, న్యాయవాది సతీష్ కుమార్, దొడ్డి తాతారావు తదితరులు అభినందిస్తూ చర్ల మండల కీర్తిని రాష్ట్రానికి చాటి చెప్పిందని భవిష్యను ప్రశంసలతో మెచ్చుకున్నారు.

Share it:

Post A Comment: