చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ప్రతి విద్యార్థి ఆహారం తినే ముందు, తిన్న తర్వాత కచ్చితంగా చేతులను శుభ్రంగా కొనుక్కోవాలని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. మూత్రశాల కు వెళ్లి వచ్చిన వెంటనే చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి అన్నారు... మన ఆరోగ్యం మన పరిశుభ్రత పై ఆధారపడి ఉంటుందన్నారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుశ్రీ, విజయ్ కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: