మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం లో మండల పరిషత్ కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాలలో ఎచ్ఎమ్ వసంత ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలో విద్యార్దులు బతుకమ్మ చేసి ఆటలు ఆడారు. ఈ సందర్బంగా ఎచ్ఎమ్ వసంత మాట్లాడుతూ రేపటి నుండి పిల్లలకు దసరా సెలవలు సందర్బంగా స్కూల్ లో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, పిల్లలతో బతుకమ్మ ఆడడం చాలా చూడ ముచ్చటిగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జుజ్జురి రాంబాబు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు, మండల టిఆర్ఎస్ యూత్ లీడర్ నాగ కిషోర్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు తరుణ్ తేజ, మాజీ సర్పంచ్ సున్నం రామలక్మయ్య, మండల యువజన టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఈశ్వర్, ధానెల్ రెడ్డి, విఆర్ఓ సిద్దెల రాము, అంగన్వాడీ టీచర్ పల్లెల సత్యవతి, కొత్తపల్లి వాణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: