CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బడ్జెట్లో కేటాయించిన 500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి

Share it:

 



ఎం.పి.టి.సి ల సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు,సంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు వడ్ల.వరకుమార్



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎం.పి.టి.సి ల సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు,వడ్ల. వరకుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో స్థానిక సంస్థలకు కేటాయించిన 500 కోట్ల రూపాయల ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రతీ ఎం.పి.టి.సి కి సంవత్సరం కు 20 లక్షల రూపాయల అభివృద్ధి కి నిధుల కేటాయింపు చేయాలని,పెన్షన్ మంజూరు విషయం లో ఎం.పి.టి.సి ల సంతకం పెట్టె విధంగా చర్యలు తీసుకోవాలని,జాతీయ జెండాను పాఠశాలలు లో ఎగురవేశే అవకాశం కల్పించాలని కోరారు.గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీ,గది కేటాయించాలని, ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ను కోరారు.ఇట్టి డిమాండ్స్ ను రాష్ట్ర అధ్యక్షుడు గడిలా. కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి.దయాకరరావు, మంత్రి హరీశ్ రావు ను, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసి విన్నవించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎం.పి.పి కె.వి.రావు,జిల్లా ఎం.పి.టి.సి ల సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,ఎం.పి.టి.సి మచ్చ.సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: