అటవి క్షేత్ర అధికారి మురళి
గుండాల అక్టోబర్ 4 (మన్యం మనుగడ) వన్యప్రాణులను రక్షించడం మానవాళి బాధ్యత అని గుండాల అటవి క్షేత్ర అధికారి మురళి అన్నారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు లో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ప్రధమ, తృతీయ, తృతీయ, బహుమతులను మంగళవారం పాఠశాలలో అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాలాజీ, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రామయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: