మన్యం మనగడ ,వాజేడు:
వాజేడు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇంటింటికి రైతుబంధు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, మరి ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరు ఇస్తుందని గర్వంగా చెప్పారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లo వెంకట్రావు. మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి గ్రామపంచాయతీ వైకుంఠ గ్రామాలు పల్లె ప్రకృతి డంపింగ్ యార్డులు రోడ్లు హరితహారం మొక్కలు పెంచడం వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది ఈ నేపథ్యంలో పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు వ్యవసాయానికి కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నారని ప్రభుత్వాన్ని కొనియాడారు.స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో పి ఏ సి సి ఎగ్గిడి. అంజయ్య. జెడ్ పి టి సి తల్లడి పుష్పలత. ఎంపీపీ శ్యామల శారద. ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Post A Comment: