మాన్యం టివి/ప్రతినిధి:ములకలపల్లి మండలం:మాదారం గ్రామం లో ములకలపల్లి జడ్పీటీసీ,టీపీసీసీ మెంబెర్,సున్నం నాగమణి ఇంటి వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వడం లో స్థానిక ఎమ్మెల్యే రాజకీయ నాయకుల జోక్యం తగదని,సున్నం నాగమణి తెలియపరిచారు, పోడు భూముల హక్కు పత్రాలు విషయం లో స్థానిక ఎమ్మెల్యే లకు అవకాశం ఇస్తే గ్రామాల్లో గిరిజనేతరులు, రాజకీయ ప్రయోజనాలు పొందుతారని,కావున గిరిజన సంక్షేమ శాఖల అధికారులు,అటవీశాఖ అధికారులు,రెవిన్యూ శాఖ ల అధికారులతో సర్వే చేయించాలని ప్రభుత్వాని డిమాండు చేసారు,2005 ముందు పోడు సాగుచేసుకున్నవారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలను కేంద్రం నిబంధనల ప్రకారం ఇవ్వాలని,పోడు సాగుదారుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వెయ్యాలని, రాష్ట్ర ప్రభుత్వాని డిమాండు చేసారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: