మణుగూరు మండల సన్నాహక సమావేశంలో పాల్గొన్న విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు,ప్లినరీ,విజయ గర్జన సభలను విజయవంతం చేయాలని,మణుగూరు మండల స్థాయి సన్నాహక సమావేశం ను మండల అధ్యక్షులు ముత్యంబాబు అధ్యక్షుతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,సీఎం కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ స్దాపించి 20 సంవత్సరాలు పుర్తి అవుతున్న సందర్భంగా పలు కార్యక్రమాల కు పిలుపునిచ్చారన్నారు. టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25 న జరిగే పార్టీ ప్లీనరీ మరియు నవంబర్ 15 న వరంగల్ లో జరిగే విజయగర్జన సభలను విజయవంతం చేయాలని కోరారు.27వ తేదిన నియోజకవర్గ సమావేశం కు అందరూ హాజరుకావాలని కోరారు.నవంబర్ 15వ తేదిన వరంగల్లో జరిగే విజయ గర్జన సభకు గ్రామంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.నాయకులు,కార్యకర్తల సమీకరణ,గ్రామ కమిటీ అధ్యక్షులు భాధ్యత తీసుకొని పని చేయాలన్నారు.స్దానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసుకొని అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు.ప్రతి గ్రామం నుండి ఒక బస్సు ఏర్పాటు చేస్తామని కార్యకర్తలు అందరూ హజరుకావాలన్నారు.నియోజవర్గం నుండి 7 వేల నుండి 8 వేల మంది సభకు హాజరుకావాలని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం,అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు.పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికి తప్పకుండా తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయకుమారి,జడ్పీటీసి పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,పార్టీ ప్రధాన కార్యదర్శి రామిడి.రాం రెడ్డి, యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,కో అప్షన్ సభ్యులు,నాయకులు వట్టం. రాంబాబు,మహిళ అధ్యక్షురాలు రమాదేవి, మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: