మన్యం టివి, దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిధిలో గల పెద్ద నల్లబెల్లి రైతు వేదికలో నీతి అయోగ్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, వస్సన్ సంస్థ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీ ఆయాలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వస్సన్ సంస్థ ప్రతినిధి సాయి నాథ్ మాట్లాడుతూ పాత పంటల ఆహారంతో బలమైన రేపటి తరాన్ని నిర్మించాలని చిరుధాన్యాల లో ఉండే క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, ఫైబర్ పోషకాల గురించి వివరించారు .చిరుధాన్యాలతో గర్భిణులు ,బాలింతలు ,పిల్లల్లో రక్తహీనతను,పోషకాహార లోపాన్ని నివారించవచ్చు అని అన్నారు .దుమ్ముగూడెం ప్రాజెక్ట్ సిడిపిఓ గారు మాట్లాడుతూ చిరు ధాన్యాల వినియోగం ఆవశ్యకతను వివరించారు. పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించాలని కోరారు. చిరుధాన్యాలతో చేసిన వంటకాలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులోకొర్ర పాయసం, కొర్ర కిచిడి,సామ పాయసం,సామ పులిహోర,సామ పెరుగన్నం, రాగి లడ్డు, రాగి జావ, రాగి రొట్టెలు,జొన్న లడ్డు తయారు చేయడం జరిగింది .ఈ కార్యక్రమ సి పి డి ఓ నవ్యశ్రీ , సూపర్వైజర్ కవిత,ధన లక్ష్మి, సావిత్రి ..రిసోర్స్ పర్సన్లు స్వప్న, సుహాసిని ,పూర్ణ, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు.
Post A Comment: