మన్యం టీవి, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునరాగమనం కార్యక్రమం నిర్వహించటం జరిగింది, ఈ కార్యక్రమం లో గతంలో మాయమాటలు నమ్మి ఇస్లాం లోకి వెళ్ళిన 7 కుటుంబాలు హిందూ ధర్మం లోని విశిష్టతను గుర్తించి రాష్ట్రం లోనే తొలిసారిగా తిరిగి స్వ ధర్మం అయిన హిందూ ధర్మం లోకి రావడం జరిగింది, వీరందరితో స్వయంగా యజ్ఞం చేపించి ప్రతిజ్ఞా చేపించటం జరిగింది, ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ జాతీయ సహ కార్యదర్శి గుమ్మళ్ళ సత్యం జీ పాల్గొని మార్గదర్శనం చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి వోరుగంటి సురేష్ కుమార్, విభాగ్ మాతృశక్తి సంయోజిక గానుగపాటి లక్ష్మి సరోజ, విభాగ్ మాతృశక్తి సహ సంయోజిక రేగడి విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, బజరంగ్దళ్ జిల్లా ఆఖాడా ప్రముఖ్ బీరా రమేష్, మణుగూరు మండల అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, మణుగూరు మాతృశక్తి సంయోజిక శ్యామల, రామానుజవరం ఖండ అధ్యక్షులు నరసింహ రాజు, రామానుజవరం బజరంగ్దళ్ సంయోజక్ వెంకటేశ్వర్లు, ఆగమ్మ, ముత్యాల వెంకటేశ్వర్లు, తదితర కార్యకర్త లు పాల్గొన్నారు.
Post A Comment: