CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధరలు పెంచి ప్రజలపై పెనుభారం వేశారు

Share it:

 


 నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదు

 ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

  గుండాల అక్టోబర్ 10 (మన్యం మనుగడ) ధరలు పెంచి ప్రజలపై పెనుభారం వేశారని న్యూ డెమోక్రసీ నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని నరసాపురం గ్రామ సమీపంలో గల కిన్నెరసాని వాగు వద్ద ఎస్ డి ఎల్ సి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోప అన్నారు. నల్ల చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదన్నారు. నెలల కొద్ది ఢిల్లీ శివారులో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే వాటిని రద్దు చేయకపోగా రైతులపై దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కోడు భూములను ఎలా రక్షించుకోవాలి అన్న అంశంపై చర్చించామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాచర్ల సత్యం , గుండాల ఆళ్ల పల్లి ఎస్ డి ఎల్ సి కార్యదర్శి శంకరన్న, డివిజన్ నాయకులు వాంకుడోత్ అజయ్, కొమరం శాంతయ్య , ఈ సం చంద్రయ్య , బోర్ర వెంకన్న, ఈ సం కృష్ణ , సనప కుమార్, సనప కృష్ణ , తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: