చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా నాయకులు తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...... పోడు సాగు రైతులతోఈనెల 25న ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పోడు దారులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా పోడుసాగుదారుల వివరాలను అధికారులను సేకరించాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ పేదల సంఘం నాయకులు కుంజా నాగేంద్రబాబు, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: