- ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో గెలుపు
-క్రీడల్లో గెలుపు,ఓటమిలను సమానంగా స్వీకరించాలి:ఎస్సై ప్రవీణ్
-విజయవంతంగా ముగిసిన క్రికెట్ టోర్నీ
మన్యం టీవి,కరకగూడెం: దసరా పండుగను పురస్కరించుకుని స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రంగాపురంలో నిర్వహించిన జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ విజేతగా మొహమ్మద్ ఫారూఖ్ సారథ్యంలోని కరకగూడెం ప్రెస్ క్లబ్ జట్టు నిలిచింది.టోర్నీలో 8 జట్లు పాల్గొనగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పినపాక ప్రెస్ క్లబ్ జట్టుపై 14పరుగుల తేడాతో గెలిచి విజయకేతనం ఎగురవేసింది.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పఠాన్ అతిక్ ఖాన్,మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గుడ్ల రంజిత్ కుమార్, సురేష్ లు సంయుక్తంగా కైవసం చేసుకున్నారు.అనంతరం విజేతలకు కరకగూడెం ఎస్సై ప్రవీణ్ కుమార్ బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... క్రీడల్లో గెలుపు,ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు.అలాగే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధికారులకు,ప్రజా ప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని విషయమని పేర్కొన్నారు. అంతేకాకుండా టోర్నీని తమ జట్టు సమిష్టిగా పోరాడి గెలవడం చాలా సంతోషంకరంగా ఉందని అలాగే టోర్నీ విజయవంతంగా ముగియడం ఎంతో ఆనందంగా ఉందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఫారూఖ్ తెలిపారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: