సెల్ టవర్ ఏర్పాటు చేయాలని వేడుకోలు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని దుగినేపల్లి పంచాయతీలో గల తండా ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చదువుకునే పిల్లలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసులు వినడానికి సిగ్నల్ లేక, చదువుకోవడం భారంగా మారిందని యువకులు వాపోతున్నారు.సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్న కారణం చేత, బయట జరిగే విషయాలను తెలుసుకో లేక పోతున్నామని, మా గ్రామానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పెడదామంటే సిగ్నల్స్ ఉండడం లేదని తెలియజేశారు. ఈ సందర్భంగా తండా ప్రజలు అంతా కలిసి సర్పంచ్ మలిపెద్ది సత్యవతికి వినతి పత్రం సమర్పించి, సెల్ ఫోన్ టవర్ వేసే దిశగా, అధికారులకు తెలియజేయాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భూక్య శివ కళ్యాణ్,మాలోత్ భాస్కర్, మాలోత్ తిరుపతి, తదితరులు పాల్గొనడం జరిగిం
Post A Comment: