మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన కొర్ర మోతిలాల్, సుజాత దంపతుల కుమారుడు వీరభద్రం అండర్ 17 జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు, అత్యుత్తమ శిక్షణ పొందడానికి తమిళనాడు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దాతల సహాయం కోరడంతో, స్పందించిన నర్సాపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గ్రామ అధ్యక్షుడు లేళ్ల గోపాల్ రెడ్డి కొర్ర వీరభద్రాన్ని అభినందించి, తనవంతు ఆర్థిక సహాయంగా మూడు వేల రూపాయల చెక్కును ఆదివారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలంలొని మారుమూల ప్రాంతం సూరారం లో యువ క్రీడాకారుడు వీరభద్రం క్రికెట్ జాతీయ స్థాయిలో ఎంపిక కావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసి జూలూరుపాడు మండలానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. రైతు కూలి కుటుంబంలో పుట్టిన వీరభద్రంకు తన వంతు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆర్థికంగా వెనకబడిన క్రీడాకారులను ప్రోత్సహించి మనకు చేతనైన ఆర్థిక సహాయాన్ని అందించి నట్లయితే వారు అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని అన్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించ వలసిందిగా కోరారు.
Navigation
Post A Comment: