మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఇల్లందు పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇల్లందు పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొక్కు నాగేశ్వర రావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. . నవంబర్ 15వ తారీఖున వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ పార్టీ మహాగర్జన సభకు ఇల్లందు పట్టణ ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ధర్నా చేయాలని ప్రతి వార్డు అధ్యక్ష కార్యదర్శులు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు సీనియర్ నాయకులతో కలిసి పోయి వార్డులోని ప్రజలు టిఆర్ఎస్ పార్టీ అందించిన అభివృద్ధి ఫలాలను తెలియజేస్తూ మహాగర్జనకు తరలిరావాలని అలాగే ఇల్లందు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, రాష్ట్ర రైతు సమన్వయ సభ్యులు పులిగండ్ల మాధవరావు, టిఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పి వి కృష్ణారావు, ఏసు నరసింహారావు వార్డు కౌన్సిలర్ లు వార్డు అధ్యక్ష కార్యదర్శులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: